తూర్పుగోదావరి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సత్వర పరీక్షలు చేసేందుకు రాజమహేంద్రవరంలో సంజీవని బస్సును ఏర్పాటు చేశారు. పరీక్షలు చేయించుకోవడం కోసం అనుమానితులు తరలివచ్చారు. ఇదిలా ఉండగా.. పరీక్షల నిర్వహణకు అవసరవైన కిట్లు లేకపోవటంతో ప్రజలు వెనుదిరిగారు.
సంజీవని బస్సులో కరోనా నిర్ధరణ కిట్ల కొరత
మారుమూల ప్రాంతాల ప్రజలకూ కరోనా పరీక్షలు చేయాలన్న లక్ష్యంతో... రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన సంజీవని బస్సులో సరిపడా కరోనా నిర్ధరణ కిట్లు లేవు. ఫలితంగా పరీక్షలు నిర్వహించుకోవడం కోసం వచ్చిన ప్రజలు నిరాశ చెందారు.
రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన సంజీవని బస్సు