ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ. 2.95 లక్షలతో అమ్మవారికి వెండి కానుకలు బహుకరణ

మందపల్లిలోని శనేశ్వర ఆలయంలో గల శ్రీ పార్వతి అమ్మవారికి ఓ దంపతులు రూ.2.95 లక్షలు విలువ చేసే నగలు బహుకరించారు. అధికారుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆభరణాలను అలంకరించారు.

By

Published : Oct 19, 2020, 4:13 AM IST

rs. 2.95 lakhs silver gifts donated
రూ. 2.95 లక్షలతో అమ్మవారికి వెండి కానుకలు

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలోని శ్రీ మందేశ్వర(శనేశ్వర) ఆలయంలో గల శ్రీ పార్వతి అమ్మవారికి దాతలు రూ.2.95 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలను బహుకరించారు. హైదరాబాద్‌కు చెందిన హరినాథ్‌, లలిత దంపతులు నాలుగు కేజీలతో వెండి చీర, కిరీటం, హస్తములు, పాదములు, పళ్లెము చేయించారు. దాతలు, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి ఆభరణాలను అలంకరించారు.

ABOUT THE AUTHOR

...view details