పార్టీల ప్రతినిధులతో ప్రత్తిపాడు ఆర్వో సమావేశం
ఈ నెల 23న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆ రోజు పాటించాల్సిన నిమయాలను పార్టీల ప్రతినిధులకు ప్రత్తిపాడు రిటర్నింగ్ అధికారి తెలియజేశారు.
పార్టీల ప్రతినిధులతో ఆర్వో
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వివిధ పార్టీలు ప్రతినిధులతో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మురళీ సమావేశమయ్యారు. ఓట్ల కౌంటింగ్ సమయంలో పాటించాల్సిన నియమాలను పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. ప్రవర్తన నియమావళిని దృష్టిలో పెట్టుకొని అధికారులకు సహకరించాలని కోరారు. ప్రత్తిపాడు తహశీల్దార్ కార్యాలయం లో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.