ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 14, 2019, 6:31 PM IST

ETV Bharat / state

పింఛన్ల పంపిణీలో జాప్యం.. సాంకేతిక సమస్యలే కారణం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ పింఛను పథకం అమలుకు... సాంకేతిక సమస్యలు అడ్డం పడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో ఈ సమస్యల వల్ల జాప్యం జరుగుతోంది.

తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతోన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం

తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతోన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం

పించన్ల జారీలో జాప్యం జరుగుతోంది. సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో.. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పుస్తకాలు లబ్ధిదారులకు చేరకపోవడం, మండల అధికారులు బదిలీ కావడం, పింఛను దారుల వేలిముద్రలు సరిగా పడక పోవడం లాంటి కారణాలు.. జాప్యానికి దోహదం చేస్తున్నాయి. నియోజకవర్గంలో 25 వేల మందికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయింపు చేసినా.. ప్రక్రియ మాత్రం ఆలస్యమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details