ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో ముగిసిన నామినేషన్లు

తూర్పుగోదావరి జిల్లాలో నామినేషన్ల కార్యక్రమం ముగిసింది. అన్ని పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. మరోవైపు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

By

Published : Mar 26, 2019, 7:18 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో ముగిసిన నామినేషన్లు

తూర్పుగోదావరి జిల్లాలో ముగిసిన నామినేషన్లు
రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బోడా వెంకట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యకర్తలు, అభిమానులతో తరలివచ్చి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు.

తుని
తుని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాజా మరో నామపత్రం దాఖలు చేశారు. ఇప్పటికే ఆయన నామినేషన్ వేసినప్పటికీ... కాకినాడ ఎంపీ అభ్యర్థి వంగా గీతతో కలిసి ప్రదర్శనగా వచ్చి మరో సెట్ నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అభ్యర్థిగా రాజా అశోక్ బాబు నామినేషన్ దాఖలు చేశారు.

పెద్దాపురం
పెద్దాపురం నియోజకవర్గంలో వివిధ పార్టీల అభ్యర్థులునామినేషన్లు దాఖలు చేశారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధి తుమ్మల రామస్వామి.. వేలాదిమంది కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేశారు. పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి వేటుకూరి అమ్మన్న, జనజాగృతి పార్టీ నుంచి కలిదిండి రమణమ్మ, జై భారత్‌ నేషనల్‌ పార్టీ తరుఫునగొరకపూడి చిన్నయ్యదొర, రాజ్యాధికారి పార్టీ నుంచి రాయుడు మోజేష్‌బాబు, ప్రజాశాంతి పార్టీ నుంచి కొండేపూడి రవిబాబు నామినేషన్లు దాఖలు చేశారు.

కొత్తపేట

కొత్తపేట నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగాచిర్ల జగ్గిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సాయిబాబు గుడి వద్ద పూజలు చేసి నామినేషన్ వేసేందుకు తహసీల్దార్ కార్యాలయానికివెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి విద్యా సాగర్ కు నామినేషన్ పత్రాలను అందించారు.తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి పేదలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆయన చేసిన అభివృద్దే తమను గెలిపిస్తుందన్నారు. మండలంలోని ఖండ్రిగ, అవిడి, పలివెల,గంటి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.


అనపర్తి మండలంలో తెదేపా అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. రాజమహేంద్రవరం తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, అనపర్తి అసెంబ్లీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు ప్రచార రథంపై రోడ్డు షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ గ్రామాల్లో పర్యటించారు. కొన్నిచోట్ల నేరుగా ప్రజలను కలుస్తూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు తెదేపాకు వేసి తమను గెలిపించాలని కోరారు.

ఇవి చదవండి

సొంతూరిలో అమలాపురం తెదేపా అభ్యర్థి ప్రచారం


ABOUT THE AUTHOR

...view details