కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న విడుదల అయ్యాయి. మూడో తేదీ అర్ధరాత్రి నుంచి ఎన్నికల కోడ్ని ఎన్నికల సంఘం ఉప సంహరించింది. కానీ నేటికి స్థానికంగా ఉన్న నాయకుల విగ్రహాలకు ముసుగు తొలగించకపోవటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఇలా ఉండడంతో ప్రజలు అధికారుల అలసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల కోడ్ ముగిసినా.. తొలగించని ముసుగు
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. అయినా నేటికి ప్రముఖల విగ్రహాలపై ముసుగులను తొలగించలేదు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విగ్రహాలకు ముసుగు