ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా గోగులాంబ అమ్మవారి జాతర మహోత్సవం

గ్రామ దేవతగా కొలిచే గోగులాంబ అమ్మవారి జాతర మహోత్సవం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మెుక్కులు తీర్చుకున్నారు.

By

Published : Apr 23, 2019, 7:07 AM IST

వైభవంగా గోగులాంబ అమ్మవారి జాతర

వైభవంగా గోగులాంబ అమ్మవారి జాతర

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోని గోగులాంబ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. జాతర మహోత్సవం సందర్భంగా కేరళ డప్పు వాయిద్యాలు, కాళికాదేవి వేషధారణలు, గారడి నృత్యాలు, బుట్ట బొమ్మలు, యువత విచిత్ర వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమంలో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details