ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిర్యాదు చేశారని..ముగ్గురు మహిళల గ్రామ బహిష్కరణ

ఇంటి పట్టాల కోసం ఆ ముగ్గురు ఒంటరి మహిళలు పోరాడి సాధించుకున్నారు.. కానీ ఆ ఊరు పెద్దలకు వీరికి భూమి ఇచ్చేందుకు అంగీకరించలేదు.. దీనిపై వారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆగ్రహించిన గ్రామ పెద్దలు ముగ్గురు మహిళలను గ్రామ బహిష్కరణ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బూడిదగట్టువారిపల్లిలో జరిగింది.

By

Published : Sep 22, 2020, 6:23 PM IST

ladies deportation
మహిళల గ్రామ బహిష్కరణ

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బూడిదగట్టువారిపల్లికి చెందిన ముగ్గురు ఒంటరి మహిళలను గ్రామ బహిష్కరణ చేసి, ఆంక్షలు విధించారు ఊరి పెద్దలు. గ్రామానికి చెందిన కామేశ్వరి, సుహాసిని, కళావతి.. ఇంటి పట్టాల కోసం పోరాడి సాధించుకున్నారు. కానీ గ్రామ పెద్దలు, ఊరిలో సెంటు భూమి కూడా ఇచ్చేందుకు వీలు లేదని తీర్మానం చేశారు. ఇక చేసేదేమీ లేక ఈ ముగ్గురు మహిళలు పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. గ్రామస్తులపై ఫిర్యాదు చేస్తారా అని ఆగ్రహించిన ఊరి పెద్దలు, ముగ్గురు మహిళలను గ్రామం నుంచి బహిష్కరించి, ఆంక్షలు విధించారు. ఊరిలో జరిగే శుభకార్యాలకు వారు రాకూడదనీ.. వారి ఇళ్లకు గ్రామస్తులు వెళ్లకూడదనీ హుకుం జారీ చేశారు. తమ సమస్యను పోలీసులకు వివరించినా స్పందించలేదనీ.. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని బాధితులు వాపోయారు.

For All Latest Updates

TAGGED:

deportation

ABOUT THE AUTHOR

...view details