తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ ఉదయం దర్శన సమయంలో మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి, స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రెండు రాష్ట్రాలు సహాయ, సహకారాలతో ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్
తిరుమల శ్రీనివాసుడిని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు.
telangana minister talasani srnivas yadav visit to the thirumala srivaaru in chitturu