ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రచార ఆర్భాటాలు తప్ప..ప్రజా సమస్యలు పట్టవు'

ప్రజల సమస్యలు మరిచి ప్రచార ఆర్భాటాలకే అధికార పార్టీ నాయకులు ప్రాధాన్యమిస్తున్నారంటూ తెదేపా నాయకులు కందికుంట వెంకట ప్రసాద్ విమర్శించారు. నాయకుల నిర్లక్ష్యం వల్ల గ్రామీణ పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఊరుకోమని, తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.

By

Published : Jun 21, 2021, 12:12 PM IST

tdp leader kandikunta
తెదేపా నాయకులు కందికుంట వెంకట ప్రసాద్

ప్రజా సమస్యల కంటే ప్రచారాలకే అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారంటూ తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్​ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ఆరోపించారు. రహదారుల విస్తరణ పేరుతో ఇళ్ల యజమానులకు సమాచారం ఇవ్వకుండా రాత్రి వేళల్లో భవనాలను కూల్చివేసే అధికారం ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానాల ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. అధ్వానంగా మారిన రహదారికి.. తాత్కాలిక మరమ్మతులు చేపట్టకుండా విస్తరణ పేరుతో ఏడాదిగా కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. నాయకుల నిర్లక్ష్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల కష్టాల్లో చిక్కుకుపోతున్నారని విమర్శించారు. అధికార దర్పంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details