ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACCIDENT: సి. మల్లవరం వద్ద రోడ్డు ప్రమాదం...దంపతులు మృతి

By

Published : Jul 22, 2021, 2:38 AM IST

పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు.

రొడ్డు ప్రమాదం
రొడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సి.మల్లవరం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని...బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...తిరుపతికి చెందిన జగన్నాథం తన భార్యతో కలిసి చంద్రగిరిలో తమ బంధువు అంత్యక్రియల్లో పాల్గొని చంద్రగిరి నుంచి తిరుపతికి బైకుపై బయలుదేరాడు.

సి.మల్లవరానికి చేరుకోగానే.. విజయవాడ నుంచి కలికిరికి వెళుతున్న బొలెరో వాహనం వెనుకవైపునుంచి వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో భార్యభర్తలు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. స్థానికులు 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని ఎం.ఆర్.పల్లి పోలీసులు తెలిపారు. కెేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి:
Biryani: 5 పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

ABOUT THE AUTHOR

...view details