ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భాకరపేట కనుమదారిలో ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

By

Published : Feb 24, 2021, 12:27 PM IST

తిరుపతి - అనంతపురం జాతీయ రహదారిలోని భాకరాపేట కనుమదారిలో ఆటో - మినీ లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. మినీలారీలో ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

road accident at chittoor district
భాకరపేట కనుమదారిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తిరుపతి - అనంతపురం జాతీయ రహదారిలో భాకరపేట కనుమదారిలో ఆటో - మినీలారీ ఢీ కొన్నాయి. ఎర్రవారిపాలెం నుంచి టమాటోల లోడుతో తిరుపతికి వెళ్తున్న మినీ లారీ.. తిరుపతి నుంచి రొంపిచర్లకు వెళ్తున్న ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మినీలారీలో ఉన్న ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details