ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిత్తూరు జిల్లాలో ఫిష్ అవుట్ లెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా

By

Published : Mar 28, 2022, 4:58 PM IST

Fish Outlets Across the Andhra Pradesh: చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం గోవిందపాలెంలో ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్​ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు.

mla Roja launched Fish Outlet
ఫిష్ అవుట్ లెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా

MLA ROJA News: ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఫిష్ అవుట్ లెట్లు ఏర్పాటు చేశారు. తాజాగా చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలం గోవిందపాలెంలో ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్​ను వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా.. రిబ్బన్ కట్ చేసిన రోజా.. చేపలను పట్టుకొని ప్రదర్శించారు. ఫిష్ ఆంధ్ర-ఫిట్ ఆంధ్ర నినాదంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపల దుకాణాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తాజా, ఆరోగ్యకరమైన చేపలను సరసమైన ధరలకు ప్రజలకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఫిష్​ అవుట్​ లెట్​ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details