ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేనమామ అత్యుత్సాహం... తీసింది బాలిక ప్రాణం...

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేటలో లారీని అధిగమించే ప్రయత్నంలో ప్రమాదం చోటుచేసుకుంది... ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందింది.

By

Published : Jun 25, 2019, 9:03 AM IST

బాలిక ప్రాణం తీసిన ఉత్సాహం

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేట గ్రామం వద్ద ద్విచక్ర వాహనం లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందింది, మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరుకు చెందిన సోహెల్ తన అక్క కుమార్తె హదియా(14)తో బైరెడ్డిపల్లె నుంచి ద్విచక్ర వాహనంపై పుంగనూరు కి వెళ్తుండగా శంకర్రాయలపేట వద్ద ముందు వెళ్తున్న లారీని అధిగమించి వెళ్లేందుకు ప్రయత్నించాడు... దీనితో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిపోయారు. లారీ టైర్లు హదియాపై నుంచి వెళ్లడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది... సోహెల్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

బాలిక ప్రాణం తీసిన ఉత్సాహం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details