ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

408 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్​

అక్రమార్కులు గంజాయిను తరలించేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా వంట సామగ్రి కింద ఉంచి భారీగా గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

By

Published : Apr 28, 2019, 5:05 PM IST

పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి

కేటుగాళ్ల కొత్త రూటు

చిత్తూరు జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని కురబలకోట మండలంలో చెన్నై- హైదరాబాద్ జాతీయ రహదారిలో పోలీసులు వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ క్రమంలో ఓ బొలెరో వాహనంలో వంట సామగ్రి కింద గుట్టుగా తరలిస్తున్న 408 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. ఈ రవాణాకు పాల్పడుతున్న తిరుపతి, విశాఖపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details