ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం అమ్మకాలు వద్దంటూ సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ నిరసన

రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడంపై సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేశారు. తిరుపతిలో యశోదనగర్ లోని కార్యాలయం ముందు భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలియజేశారు.

By

Published : May 11, 2020, 5:57 PM IST

మద్యం దుకాణాలు తెరవడంపై సిఐటియు, ఎస్.ఎఫ్.ఐ నిరసన
మద్యం దుకాణాలు తెరవడంపై సిఐటియు, ఎస్.ఎఫ్.ఐ నిరసన

ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి బయట పడుతున్నాం అనుకొంటున్న సమయంలో ప్రభుత్వం మద్యం షాపులను తెరిచి అయోమయంలో పడవేసిందని సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. తిరుపతిలో వారు నిరసన చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా.. సంపూర్ణ మద్య నిషేధం అనిచెప్పిన విషయం గుర్తు చేశారు.

ఇప్పుడు అంతకంతకూ రేట్లు పెంచుకొంటూ ప్రభుత్వమే మద్యం దుకణాలు నడపడం విడ్డూరమని విమర్శించారు.లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలను మూసివేసి, ప్రజలకు అవసరమైన అత్యవసర సరుకుల దుకాణాలు తెరవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details