ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదు కాదు... ఏడుచోట్ల రీపోలింగ్: ప్రద్యుమ్న

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 7కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు.

By

Published : May 18, 2019, 4:29 PM IST

ఐదు కాదు... ఏడుచోట్ల రీపోలింగ్

ఐదు కాదు... ఏడుచోట్ల రీపోలింగ్

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ జరిగినట్లు గుర్తించినట్లు వివరించారు. అందుకే రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. మొత్తం 7 కేంద్రాల్లో మళ్లీ ఎన్నిక జరుగుతుందని చెప్పారు. పోలింగ్ ఏర్పాట్లు, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి విస్తృత చర్యలు చేపట్టామంటున్న జిల్లా ఎన్నికల అధికారితో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details