ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 21, 2019, 9:10 PM IST

Updated : Oct 28, 2019, 8:28 AM IST

ETV Bharat / state

మోర్థనపల్లె ఆంధ్రా బ్యాంకు ఎదుట ఖాతాదారుల ధర్నా

మోర్థనపల్లె ఆంధ్రాబ్యాంకులో చోరీ జరిగి వారం రోజులు గడుస్తున్నా... తమ ఆభరణాలు, నగదు సంబంధించి బ్యాంకు అధికారులు స్పందించాలని ఖాతాదారులు ధర్నా చేశారు.

మోర్థనపల్లె ఆంధ్రా బ్యాంకు ఎదుట ఖాతాదారుల ధర్నా

చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్థనపల్లె ఆంధ్రాబ్యాంకులో 17 కిలోల బంగారం, రూ.2.66 లక్షల నగదు చోరీ జరిగి వారం రోజులు దాటింది. తమ ఆభరణాలు, నగదుకు సంబంధించి అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. తమ అభరణాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకున్నామని... చోరీ తర్వాత మత పరిస్థితి అగమ్యగోచరంగా ఉందంటూ వాపోయారు. బ్యాంకు అధికారులు ఇప్పటివరకూ ఎలాంటి పూచీ ఇవ్వలేదని...ఇప్పుడైనా స్పందించాలని వారు కోరుతున్నారు.

మోర్థనపల్లె ఆంధ్రా బ్యాంకు ఎదుట ఖాతాదారుల ధర్నా
Last Updated : Oct 28, 2019, 8:28 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details