ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం పోరాటంతోనే జోన్'

విశాఖ రైల్వే జోన్‌ ప్రకటనపై తెదేపా పార్లమెంటరీ పార్టీ స్పందించింది. రైల్వేజోన్‌ సాధనకు చంద్రబాబు నిరంతరం కృషిచేశారని వెల్లడించింది. సీఎం కృషితోనే జోన్‌కు కేంద్రం పచ్చజెండా ఊపిందని స్పష్టం చేసింది.

By

Published : Feb 28, 2019, 10:04 AM IST

Updated : Feb 28, 2019, 12:21 PM IST

తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు

తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు

విశాఖ రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వ భిక్ష కాదని... ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాట ఫలితమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. విశాఖ రైల్వే జోన్‌ ప్రకటనపై స్పందించిన పార్లమెంటరీ పార్టీ...రైల్వేజోన్‌ సాధనకు చంద్రబాబు నిరంతరం కృషిచేశారని గుర్తుచేసింది. సీఎం కృషితోనే జోన్‌కు కేంద్రం పచ్చజెండా ఊపిందని తెలిపింది. తెదేపా ఎంపీల పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జేజేలు పలుకుతున్నారని... విజ‌యం సాధించ‌డం వలనతెదేపా ఎంపీలకు అభినందనలు వస్తున్నాయని పేర్కొంది. విశాఖ రైల్వే జోన్‌ ప్రకటన తెలుగుదేశం పార్టీ పోరాట విజయమని స్పష్టం చేసింది.

Last Updated : Feb 28, 2019, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details