'వైకాపాకు తెరాస వంత.. సమంజసమా?'
రాష్ట్ర ప్రభుత్వంపై పొరుగు రాష్ట్ర తెరాస ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వైకాపా కార్యకర్తల తప్పుడు ఫిర్యాదులకు.. తెలంగాణ ప్రభుత్వం వంత పాడటం న్యాయమా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వంపై తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలబెడితే.. తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు పోలీసుల సహాయంతో ఐటీ సంస్థలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రతినిధులు తప్పుడు ఫిర్యాదులు చేస్తే వాటికి తెలంగాణ ప్రభుత్వం వంతపాడడం కుట్ర చేయడమేనని అన్నారు. తెలంగాణలో సకల జనుల సర్వే పేరుతో పాతిక లక్షల మంది ఓటర్లను తొలగించింది నిజం కాదా అని ప్రశ్నించారు.