ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎవరీ.. నవ్యాంధ్ర తొలి మహిళా హోం మంత్రి సుచరిత!

నవ్యాంధ్ర తొలి మహిళా హోం మంత్రి మేకతోటి సుచరిత. నిన్న మెున్నటి వరకూ ఈ పేరు చాలమందికి తెలియదు. ఇప్పుడు రాష్ట్రంలో అతి కీలకమైన శాంతి భద్రతల బాధ్యతలను ఆమెకే అప్పగించారు ముఖ్యమంత్రి జగన్. ఈ పరిణామంతో.. ఒక్కసారిగా సుచరిత పేరు మార్మోగుతోంది. ఇంతకీ.. మన నూతన హోం శాఖ మంత్రి సుచరిత నేపథ్యం ఏంటి? ఆమె రాజకీయ అనుభవం ఏంటి?

By

Published : Jun 8, 2019, 7:30 PM IST

Updated : Jun 9, 2019, 10:48 AM IST

home_minister_mekathoti_sucharitha

మేకతోటి సుచరిత.. చాలా కాలంగానే రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె స్వస్థలం గుంటూరు జిల్లా ఫిరంగిపురం. సుచరిత బీఏ చదివారు. ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్​తో ఆమెకు వివాహమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు ఆకర్షితురాలై 2006లో రాజకీయ ప్రవేశం చేశారు. 2006లో కాంగ్రెస్​ నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించారు.

2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్​ స్థానంగా మారింది. ఆ ఏడాదే రాజశేఖరరెడ్డి సుచరితకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించారు. 2009లో తెదేపా అభ్యర్థి కందుకూరి వీరయ్యపై గెలిచారు. గుంటూరు జిల్లాలోని తొలి ఎస్సీ మహిళా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. వైఎస్​ మరణం తర్వాత 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జగన్ వెంట నడిచారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 16వేల మెజార్టీతో గెలిచారు. 2014లో తెదేపా నుంచి బరిలో ఉన్న రావెల కిశోర్​ చేతిలో ఓటమి పాలయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా... ప్రజలకెప్పుడూ అందుబాటులోనే ఉన్నారు సుచరిత. తాజా ఎన్నికల్లో ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇప్పుడు జగన్​ కేబినెట్​లో చోటు దక్కించుకున్నారు. ఆ వెంటనే.. నవ్యాంధ్ర తొలి మహిళా హోంమంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.

Last Updated : Jun 9, 2019, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details