ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తా'

నేను వైకాపా చేరుతానని దుష్ప్రచారం జరుగుతోంది. నా జీవితాంతం చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తా. వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలి------గంటా. శ్రీనివాసరావు, రాష్ట్రమంత్రి

By

Published : Mar 13, 2019, 10:10 PM IST

గంటా. శ్రీనివాసరావు

2019 శాసనసభ ఎన్నికలు అవినీతి, అనుభవానికి మధ్య జరుగుతున్న ఓట్ల రణరంగమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. 17 వేల కోట్ల లోటుబడ్జెట్‌తో నవ్యాంధ్ర ప్రస్థానం ప్రారంభమైందని మంత్రి తెలిపారు.సీఎం చంద్రబాబు ప్రతి సంక్షోభాన్ని ఒక సవాలుగా స్వీకరిస్తారని గంటా అన్నారు. సీఎంపై నమ్మకంతో రాజధాని కోసం 33 వేల ఎకరాలు రైతన్నలు ఇచ్చారని తెలిపారు.

గంటా. శ్రీనివాసరావు

తాను వైకాపాలో చేరుతానన్న వార్తలు అవాస్తమన్న మంత్రి స్పష్టంచేశారు. వైకాపా నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు.

ABOUT THE AUTHOR

...view details