ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీఎస్సీ నియామకాల్లో వేగం.. 20న అభ్యర్థుల జాబితా!

డీఎస్సీ 2018 అభ్యర్థుల నిరీక్షణ ఫలించింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హులైన వారిని ఈనెల 20 నుంచి  ఎంపిక చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక షెడ్యూల్ విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ ద్వారా నిర్వహించనున్నారు. అభ్యంతరాలు వ్యక్తమవుతున్న 5 క్యాటగిరీల పోస్టులను పక్కన పెట్టి.. మిగిలిన వాటికి నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు.

By

Published : Jun 19, 2019, 7:02 AM IST

డీఎస్సీ నియామకాల్లో వేగం

డీఎస్సీ నియామకాల్లో వేగం

డీఎస్సీ 2018 నియామక ప్రక్రియలో జాప్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో... పాఠశాల విద్యా శాఖ ప్రాథమిక షెడ్యూల్​ను విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 4 వరకు నియామక ప్రక్రియ కొనసాగనుంది. న్యాయ వివాదాల కారణంగా తెలుగు భాషా పండితులు, హిందీ భాషా పండితులు, తెలుగు స్కూల్‌ అసిసెంట్​, హిందీ స్కూల్‌ అసిస్టెంట్​, పీఈటీ పోస్టులను మినహాయించి మిగిలిన అన్ని కేటగిరీల పోస్టులకూ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 7వేల పైచిలుకు పోస్టుల భర్తీకి డీఎస్సీ–2018 నోటిఫికేషన్‌ను గతేడాది అక్టోబర్​లో విద్యాశాఖ విడుదల చేసింది. ఎన్నికలకు ముందు ఫలితాలను విడుదల చేసి... మెరిట్ జాబితాను ప్రకటించింది. పోస్టుల భర్తీకి తాజాగా ప్రభుత్వం అనుమతి లభించినందున.. ప్రాథమిక షెడ్యూల్​ను ప్రకటించింది.

అంతా ఆన్​లైన్​లో..
ఆయా కేటగిరీల పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్‌ (సీఎస్​ఈ) ఆన్‌లైన్‌ పర్యవేక్షణలో కొనసాగనుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అనంతరం... పాఠశాలల ఎంపికకు వీలుగా వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. పోస్టింగ్‌ ఆర్డర్లను కూడా ఆన్‌లైన్​లో విడుదల చేస్తారు. ఎంపికైన అభ్యర్థి ఎవరైనా పోస్టింగ్‌ కోసం ప్రాంతాన్ని ఎంపిక చేసుకోలేని పక్షంలో అతనికి నియామకాధికారులే కేటాయింపు చేస్తారు. ఈ నెల 20వ తేదీ నుంచి టీచర్‌ పోస్టులకు అర్హులైన వారి ఎంపికకు పాఠశాల విద్యా శాఖ తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సెప్టెంబర్‌ 4 వరకు కొనసాగనుంది

ABOUT THE AUTHOR

...view details