ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు.విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి ఆలోచించాలని లేఖలో పేర్కొన్నారు. దేశంలో సౌర, పవన రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనీ.. పారదర్శక, అవినీతి రహిత పాలనకు కేంద్రం సహకరిస్తుందని సింగ్ తెలిపారు. చట్టానికి లోబడి అన్ని అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. ఈ తరుణంలో అనూహ్య నిర్ణయాలు పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. భారత్లోని సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయనీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు కుదుర్చుకున్న బిడ్స్, విద్యుత్ టారిఫ్లు గుర్తింపు పొందిన సంస్థలే నిర్దేశించాయని ఉత్తరంలో పేర్కొన్నారు.
పీపీఏల పునః సమీక్షపై ఆలోచించండి... సీఎంకు కేంద్రం లేఖ
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి సీఎం జగన్కు కేంద్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. పీపీఏల పునఃసమీక్షపై మరోసారి ఆలోచించాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ లేఖలో పేర్కొన్నారు.
పీపీఏల పునఃసమీక్షపై ఏపీ ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి: కేంద్రం