ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 25, 2020, 7:19 PM IST

ETV Bharat / state

రైతులకు భరోసా... పేదలకు చేయూత

అనంతపురం జిల్లా ఎర్రమంచిలో లాక్​డౌన్ కారణంగా పంటను అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టాన్ని చూసిన వైకాపా నాయకులు ముందుకొచ్చి పంట కొనుగోలు చేశారు. వాటిని గ్రామస్థులకు పంపిణీ చేశారు.

vegetable distribution in ananthapuram district
ఎర్రమంచిలో కూరగాయలు పంపిణీ చేస్తున్న వైాకాపా నేతలు

అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని ఎర్రమంచిలో వైకాపా నాయకులు రామాంజనేయులు, నాగమూర్తి.. రైతులు పండించిన కూరగాయలను కొనుగోలు చేశారు. వీటిని కియా ఇండస్ట్రీయల్ ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో గ్రామస్థులందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని ఎస్సై గణేశ్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details