ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెత్తకుప్పలో.. విగతజీవిగా నవజాత శిశువు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ నవజాత శిశువు.. చెత్తకుప్పలో విగతజీవిగా కనిపించగా.. అధికారులు మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించారు.

By

Published : Oct 10, 2019, 10:32 PM IST

kid

అమ్మా! నన్నెందుకు చెత్తకుప్పలో పడేశావ్!

పండంటి మగబిడ్డను చెత్తకుప్పపాలు చేశారు. అప్పుడే పుట్టిన పసికందును.. అన్యాయంగా మృత్యువు ఒడికి చేర్చారు. ప్లాస్టిక్ కవర్లో చుట్టి.. నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. మానవత్వానికే మచ్చ తేచ్చేటువంటి ఈ హృదయ విదారక ఘటన... అనంతరపురం రాయదుర్గం వాసులను కంటతడి పెట్టించింది. రాయదుర్గం ప్యాలెస్ సినిమా థియేటర్ సమీపంలోని చెత్తకుప్పలో.. విగతజీవిగా కనిపించిన నవజాత శిశువును చూసిన స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతశిశువును పరిశీలించారు. అంత్యక్రియల నిమిత్తం మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details