ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిద్దె మీద నిద్రపోయే వారి ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు

ఉక్కపోత కారణంగా రాత్రుళ్లు మిద్దెమీద నిదురించే వారి ఇళ్లే లక్ష్యంగా అనంతపురం జిల్లాలో దొంగలు చోరీలకి పాల్పడ్డారు.

By

Published : May 6, 2019, 9:51 PM IST

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై

చోరీల కలకలం
అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో దొంగలు చేతివాటం చూపారు. ఉక్కపోత దృష్ట్యా మిద్దెలపై పడుకుంటున్న వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 30 వేల గదు.. బంగారం దోచుకెళ్లారు. మిగతా ఇళ్లల్లో ఎంత దోచుకున్నారన్నది తెలియాల్సి ఉంది. ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కదిరి రూరల్ ఎస్సై వెంకటస్వామి చోరి జరిగిన ఇళ్లను పరిశీలించి.. క్లూస్ టీంతో దర్యాప్తు చేయిస్తామని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details