ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నా చావుకు ఎవరూ బాధ్యులు కారు': మరో సెల్ఫీ వీడియో వైరల్

By

Published : Nov 24, 2020, 9:53 AM IST

అనంతపురం జిల్లాకు చెందిన యువకుడు చనిపోతున్నానంటూ....సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

young man missing in ananthapuram
నార్పల మండలంలో యువకుడి ఆదృశ్యం

నార్పల మండలంలో యువకుడి ఆదృశ్యం

అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ఉయ్యాలకుంటకు చెందిన రాజేష్(18) అనే యువకుడు పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 'నిజం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఈ ప్రపంచాన్ని వదలి వెళ్లాలనుకుంటున్నా. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టకండి.' అంటూ రాజేష్ పెట్టిన వీడియో కలకలం సృష్టిస్తోంది. ఈ వీడియో చూసిన అతడి తల్లిదండ్రులు.. తమ కుమారుడు ఎక్కడికి వెళ్లాడో తెలియక ఆందోళన చెందుతున్నారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details