ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయం: పరిటాల సునీత

పోలింగ్ రోజున అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా ఎన్నో కుట్రలు పన్నారని పరిటాల సునీత ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్​లో చంద్రబాబునాయుడు మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Apr 13, 2019, 7:56 PM IST

పరిటాల సునీత

పరిటాల సునీత

పోలింగ్ రోజున అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నేతలు ఎన్నో కుట్రలు పన్నారని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సరిగా పని చేయలేదని.. రాప్తాడు నియోజకవర్గంలోనే మధ్యాహ్నం వరకు 30కు పైగా ఈవీఎంలు పని చేయలేదన్నారు. నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ముగ్గురూ కలిసి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సునీత ఆరోపించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెదేపా ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందని... రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ మంచి మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details