ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 17, 2020, 2:50 PM IST

ETV Bharat / state

పేకాట స్థావరాలపై దాడులు​.. 3 లక్షల నగదు స్వాధీనం

అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు పోలీసులు.. పేకాట స్థావరాలపై దాడులు చేశారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3.07 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ananthapuram police
అనంతపురంలో పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు

అనంతపురంలో పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెంచలపాడు - కర్నూలు జిల్లా గుమ్మనూరు గ్రామాల మధ్యలో పేకాట నిర్వహిస్తున్న స్థావరాలపై ఉరవకొండ, విడపనకల్లు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3,07,500 రూపాయలు నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని ఉరవకొండ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఇ. వెంకటస్వామి తెలిపారు. పేకాట, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details