ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2021, 3:07 PM IST

ETV Bharat / state

పాఠశాలలో జంతువుల వధ.. మాంసం విక్రయం!

కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను మాంసపు విక్రయ శాలలుగా, వధ కేంద్రాలుగా వాడుకుంటున్నారు కొంతమంది ప్రబుద్ధులు. చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు, నగరపాలక అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి... బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన అనంతపురంలో జరిగింది.

school
పాఠశాలలో మాంసం విక్రయం

కరోనాతో పాఠశాలలకు సెలవులు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కొంతమంది బడులను మాంసపు విక్రయ, వధ కేంద్రాలుగా, పశువుల కేంద్రాలుగా మార్చేశారు. ఈ ఘటన అనంతపురంలోని శ్రీనివాస్​ నగర్​లో జరిగింది.

అక్కడి ప్రాథమిక పాఠాశాలలో కొంతమంది వ్యక్తులు జంతువులను వధించి.. అక్కడే మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నగరపాలక అధికారులు, పోలీసులు.. పాఠశాల వద్దకు వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. పాఠశాలలో ఇటువంటి పనులు చేస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details