ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మున్సిపాలిటీ భవనం కూలి ఇద్దరికి గాయాలు

By

Published : Jan 7, 2021, 5:31 PM IST

మున్సిపాలిటీ భవనం కూలి ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది.

municipal building
మున్సిపాలిటీ భవనం కూలి ఇద్దరికి గాయాలు

అనంతపురం జిల్లా తాడిపత్రి బస్టాండ్ సమీపంలో ఉన్న మున్సిపాలిటీ భవనం కూలి ఇద్దరు గాయపడ్డారు. గత రాత్రి నుంచి వర్షం కురుస్తుండగా.. పాతబడిన భవనం కావడంతో మధ్యాహ్నం ఒక్కసారిగా కూలింది. పక్కనే దుకాణం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. భవనం శిథిలావస్థకు చేరడంతోనే కూలిందని బాధితుడు దస్తగిరి తెలిపాడు. మరమ్మతులు చేయాలని గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెెప్పాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ సిబ్బందికి విషయాన్ని తెలిపామని, వారు వచ్చిన వెంటనే మిగతా దుకాణాలను ఖాళీ చేయించడానికి చర్యలు తీసుకుంటామని సీఐ ప్రతాపరెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details