ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లి, ఇద్దరు పిల్లలు మృతి... అసలేం జరిగింది..!

అనంతపురం జిల్లా  కళాకారుల కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కళాకారుల కాలనీకి చెందిన శ్రీదేవి తన ఇద్దరు కుమారులతో కలిసి అనంతపురం సమీపంలో ఉన్న కాలువలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి శ్రీదేవి, కుమారులు దీక్షిత్‌ (8), యశ్వంత్‌ (6)లు మృతి చెందారు.

By

Published : Sep 4, 2019, 7:50 PM IST

Updated : Sep 4, 2019, 8:23 PM IST

ఏం జరిగిందో?...చెక్​డ్యాంలో తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యం

తల్లి, ఇద్దరు పిల్లలు మృతి... అసలేం జరిగింది..!

అనంతపురం సమీపంలోని కళాకారుల కాలనీలో దారుణం చోటు చేసుకుంది. రాప్తాడు మండలం కళాకారుల కాలనీకి చెందిన శ్రీదేవి తన ఇద్దరు కుమారులతో కలిసి అనంతపురం సమీపంలో ఉన్న కాలువలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలుపగా, సమీప బంధువులు మాత్రం శ్రీదేవి భర్త, అత్త ఆమెను నిత్యం వేధించేవారని, వారే ఈ ఘాతుకానికి కారకులని ఆరోపిస్తున్నారు. అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Sep 4, 2019, 8:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details