ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలిటికల్ టెర్రరిజం మొదలైంది: దీపక్​రెడ్డి

వైకాపా అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో బెదిరింపులకు దిగుతున్నారని ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు జరిగేలోపు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడులకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు.

By

Published : Jun 18, 2019, 5:16 PM IST

ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి

ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి

రాష్ట్రంలో పొలిటికల్ టెర్రరిజం మొదలైందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో దీపక్​రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులపై హోంమంత్రి సుచరిత మాట్లాడిన తర్వాత కూడా... అనంతపురం జిల్లా శింగనమలలో తెదేపా కార్యకర్తలకు చెందిన పంటలు ధ్వంసం చేశారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దాడులపై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details