ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరి పరిస్థితి విషమం

అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న అయిదుగురికి తీవ్రగాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

By

Published : Aug 6, 2019, 5:05 PM IST

వెనుక నుంచి ఆటోను ఢీకొట్టిన లారీ

వెనుక నుంచి ఆటోను ఢీకొట్టిన లారీ

అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన ఐదుగురు కర్నూలు జిల్లా ప్యాపిలి నుంచి గుత్తి వస్తుండగా ప్రమాదం సంభవించింది. అందులో మల్లమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details