ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 2, 2021, 8:25 PM IST

Updated : Aug 2, 2021, 11:59 PM IST

ETV Bharat / state

తాడిపత్రి పురపాలిక కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన..

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పురపాలిక కార్యాలయంలో.. మున్సిపల్ ఛైర్మన్​ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసనకు దిగారు. ఆలస్యంగా వచ్చిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

JC Prabhakar Reddy
జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పురపాలిక కార్యాలయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన కొనసాగిస్తున్నారు. సిబ్బంది సమయానికి రావడం లేదని మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వచ్చిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని.. డిమాండ్ చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్ సెలవులో ఉన్నట్లు అధికారులు తెలుపగా.. కమిషనర్ వచ్చే వరకు.. కార్యాలయం నుంచి కదలబోనని ఆయన నిరసనను ఇంకా కొనసాగిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు..

తాడిపత్రి పురపాలిక అధికారులు, సిబ్బందిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది ఆచూకీ లేదని ఫిర్యాదులో పేర్కొన్న ఆయన.. స్థానిక వ్యాపారుల నుంచి పురపాలిక సిబ్బందిని రక్షించాలని కోరారు.

ఇదీ చదవండి:

LOK SABHA: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం

Last Updated : Aug 2, 2021, 11:59 PM IST

ABOUT THE AUTHOR

...view details