ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలింగ్ కేంద్రంలో ఘర్షణ.. ఈవీఎం ధ్వంసం

తెదేపాకు కంచుకోట అయిన రాప్తాడు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అల్లర్లు చెలరేగాయి. ఆత్మకూరు మండలంలోని ఓ కేంద్రంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఉద్రిక్తతల మధ్య ఓ వ్యక్తి ఏకంగా ఈవీఎంను ధ్వంసం చేశాడు.

By

Published : Apr 11, 2019, 5:50 PM IST

ఈవీఎం బద్ధలు

ఈవీఎం బద్ధలు

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మండల పరిధిలోని సనప గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ఈవీఎంను ధ్వంసం చేశాడు. అధికారులు వెంటనే స్పందించి మరో ఈవీఎంను ఏర్పాటు చేసి పోలింగ్ ను ప్రారంభించారు. ఈ ఉద్రిక్తలతో అక్కడ ఓటు వేసేందుకు వచ్చిన వారు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు సిద్ధరాంపురం గ్రామంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగుతున్న సమయంలో పోలీసులు కలుగుజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details