ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సబ్ సర్ఫేస్ డ్యామ్​తో 'అనంత' సస్యశ్యామలం

అనంతపురం జిల్లా పరిగి మండలంలో కలెక్టర్ సత్యనారాయణ పర్యటించారు. శ్రీరంగరాజులపల్లి- కాలువపల్లి మధ్య మంగలి నదిపై నిర్మించిన సర్ఫేస్ డ్యామ్​ను పరిశీలించారు.

By

Published : Jul 3, 2019, 7:08 PM IST

కలెక్టర్

పరిగి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

సబ్ సర్ఫేస్ డ్యామ్ను నిర్మిస్తే... కరవు బారిన పడిన అనంతపురం జిల్లాలోని ఎక్కువ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని కలెక్టర్ సత్యనారయణ తెలిపారు. పరిగి మండలంలో ఆయన పర్యటించారు. శ్రీరంగరాజులపల్లి -కాలువపల్లి గ్రామాల మధ్య జయ మంగలి నదిపై నిర్మించిన సబ్ సర్ఫేస్ డ్యాంను పరిశీలించారు. శ్రీ రంగరాజులపల్లిలో పల్లెపిలుపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిగిలో రైతులకు వేరుశెనగ విత్తనాల పంపిణీ గురించి రైతులతో చర్చించారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులతో ముచ్చటించారు.

ABOUT THE AUTHOR

...view details