ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగిన వాహనం నడిపారు... ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు...

అనంతపురంలో  మద్యం తాగిన మత్తులో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనం నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నప్పటికీ యువతలో మార్పు కనిపించడం లేదు.

By

Published : Aug 26, 2019, 11:11 AM IST

డివైడర్​ను ఢీ కొట్టిన వాహనం

డివైడర్​ను ఢీ కొట్టిన వాహనం

ఇద్దరు యువకులు అతిగా మద్యం సేవించి ద్విచక్రవాహనంపై వేగంగా నడిమివంక వైపు బయలుదేరారు. పీటీసీ ఓవర్ బ్రిడ్జి వద్ద వాహనం అదుపు తప్పి డివైడర్​ను ఢీ కొ'ట్టారు. అనంతపురంలో జరిగిన ఈ సంఘటనలోయువకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వాహన చోదకులు వారిని 108వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్నందున వారి వివరాలు తెలియలేదు. ఈ ప్రమాదం వలన సుమారు గంటపాటు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details