ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 14, 2021, 4:38 AM IST

ETV Bharat / state

accident: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి

అనంతరపురం జిల్లా కొల్లాపూరమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఓ మహిళ.. ఆస్పత్రిలో మృతిచెందారు.

tipper hit at bike at ananthapuram
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ

అనంతరపురం జిల్లా కల్యాణదుర్గం సమీపంలోని కొల్లాపూరమ్మ గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళ.. ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతిచెందారు. కంబదూరు మండలం వేంకటంపల్లికి చెందిన బొజ్జమ్మ..భర్తతో కలిసి బైకుపై కల్యాణదుర్గం నుంచి స్వగ్రామం వెళ్తున్నారు. ఈ క్రమంలో కొల్లాపూరమ్మ గుడి సమీపంలో వాళ్ల ప్రయాణిస్తున్న బైకును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని వెంటనే కల్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బొజ్జమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలింగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details