విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం 42.5 కిలోమీటర్లు పొడవునా.. 3 కారిడార్లలో నిర్మించనున్నారు. 4200 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టేందుకు 5 సంస్థలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. మెట్రో పనులకు గురువారం టెండర్లు దాఖలు చేసే సంస్థల్లో.. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూర్చే సంస్థను ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కొరియాకు చెందిన ఎగ్జిం బ్యాంకు రుణం అధికారికంగా ఖరారైన వెంటనే... పనులను ప్రారంభించాలని భావిస్తున్నారు.