ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

భారత్​తో​ టీ20 సిరీస్​: గప్తిల్ ఔట్

ఫిబ్రవరి 6 నుంచి భారత్​తో జరిగే టీ-20 సిరీస్​కు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ దూరమయ్యాడు. బంగ్లాదేశ్​తో జరిగే మ్యాచ్​లకు అందుబాటులో ఉంటాడు ఈ స్టార్​ బ్యాట్స్​మన్.

By

Published : Feb 4, 2019, 11:40 AM IST

Updated : Feb 4, 2019, 12:08 PM IST

గాయంతో మ్యాచ్​కు దూరం

ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్​కు మరో ఎదరుదెబ్బ తగిలింది. కివిస్ ఒపెనర్ మార్టిన్ గప్తిల్ భారత్​తో జరిగే టీ -20 సిరీస్​కు దూరమయ్యాడు. వెన్నునొప్పితో ఆఖరు వన్డే ఆడని ఈ స్టార్ బ్యాట్స్​మన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు.
"దురదృష్టవశాత్తు గప్తిల్ గాయం నుంచి కోలుకోలేదు. ఐదు రోజుల పాటు జరిగే మూడు టీ20లు రసవత్తరంగా జరగబోతున్నాయి." -న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టేడ్
ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు న్యూజిలాండ్ భారత్​తో మూడు టీ 20 మ్యాచ్​లు ఆడనుంది. వన్డే సిరీస్​లో గప్తిల్ స్థానంలో జిమ్మి నీషమ్ ఆడాడు. ఈ సిరీస్​కు ఆల్ రౌండర్ డారిల్ మిచెల్​ను కూడా స్క్వాడ్​లో ఎంపిక చేశారు. వీరిద్దరిలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ స్క్వాడ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), డాగ్ బ్రాస్​వెల్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, లాకీ ఫెర్గ్యూసన్, స్కాట్ కుగ్లిజన్, డారిల్ మిచెల్, కొలిన్ మున్రో, జిమ్మి నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌధీ, రాస్ టేలర్

Last Updated : Feb 4, 2019, 12:08 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details