ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఇంట్లోకి చొరబడిన..ముగ్గురు దొంగల తాట తీసింది!

ఒంటరి మహిళే కదా... తేలికగా అన్ని కాజేసి బయటపడొచ్చని భావించారు ఆ దొంగలు. కానీ ఇంట్లోకి చొరబడ్డ వారి తాట తీసింది ఆ వీరనారి. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని పెద్దమంగళారంలో చోటు చేసుకుంది.

By

Published : Oct 12, 2019, 7:27 PM IST

woman-attacked-three-robbers-in-rangareddy-district

ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దొంగల తాటతీసింది!

ఎవరూ లేరని ఇంట్లోకి చొరబడ్డ ముగ్గురు దొంగల తాట తీసింది ఓ మహిళ. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామంలోని సిరిమల్లెకాలనీలో ఈ ఘటన జరిగింది. నిన్న అర్ధరాత్రి సైదా సుల్తానా అనే ఒంటరి మహిళ ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. చోరికి ప్రయత్నిస్తుండగా.. అప్రమత్తమైన సైదా తిరగబడింది. ఇంట్లోని వస్తువులు, నగదు దొంగలు ఎత్తుకెళ్లకుండా అడ్డుకుంది. కొద్దిసేపు ఆ ముగ్గురు దొంగలతో తలపడింది. దొంగలు కూడా ఆ మహిళను తీవ్రంగా కొట్టారు. ఓ దొంగ కుర్చీతో కొట్టడం వల్ల సైదా సుల్తానా స్పృహ తప్పి పడిపోయింది. చుట్టుపక్కల వారు వస్తున్నారని గమనించిన దొంగలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సైదా సుల్తానా సాహసాన్ని అభినందించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డితోపాటు ఎస్​వోటీ పోలీసులు... సైదా నివాసంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దొంగలదాడిలో సైదా సుల్తానా తలకు, మోచేతికి గాయాలయ్యాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details