ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2020, 5:43 PM IST

ETV Bharat / jagte-raho

దుకాణాల్లో చోరీ చేసి.. ఒఎల్​ఎక్స్​లో అమ్ముతున్నారు: సజ్జనార్

హైదరాబాద్ మియాపూర్​లో చోరీకి పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు గతంలోనూ పలు దొంగతనాలకు పాల్పడినట్టు సీపీ సజ్జనార్ వెల్లడించారు.

cyberabad-cp-sajjanar
cyberabad-cp-sajjanar

హైదరాబాద్ మియాపూర్‌లోని రిలయన్స్ డిజిటల్‌లో ఇటీవల చోరీకి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో జరిగిన ఈ చోరీలో 119 సెల్‌ఫోన్ల చోరీ జరిగినట్లు గుర్తించిన పోలీసులు... ఈ కేసులో ముంబయికి చెందిన మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. గతంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అపహరించిన మొబైల్స్​ను ఒఎల్​ఎక్స్​లో అమ్ముతున్నట్టు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details