ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 22, 2021, 8:22 PM IST

ETV Bharat / city

ప్రజలను మభ్య పెట్టేందుకే గంటా రాజీనామా: విష్ణుకుమార్ రాజు

ప్రజలను మభ్య పెట్టేందుకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారని భాజాపా నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ఆయన రాజీనామా ఆమోదముద్ర పొందదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ప్రజలను మభ్య పెట్టేందుకే గంటా రాజీనామా
ప్రజలను మభ్య పెట్టేందుకే గంటా రాజీనామా

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాపై భాజపా నేత విష్ణుకుమార్ రాజు మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజలను మభ్య పెట్టేందుకే గంటా రాజీనామా చేశారన్నారు. ఆయన రాజీనామా ఆమోదముద్ర పొందదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీవీఎంసీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా గంటా ఎక్స్అఫీషియో ఓటును వైకాపాకు వినియోగిస్తారని విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details