విశాఖలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. డాబాగార్డెన్స్లో నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ గోడ కూలి ముగ్గురు కూలీలు చిక్కుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురిలో ఓ వ్యక్తిని పోలీసులు కాపాడగా... మరో ఇద్దరు చనిపోయారు. వీరిలో ఒకరు విజయనగరం జిల్లా బాడంగికి చెందిన శంకర్రావుగా..మరొకరు తమిళనాడుకు చెందిన శివగా గుర్తించారు. ప్రొక్లెయిన్ సహయంతో మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
విశాఖలో విషాదం...ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతి
విశాఖలో డాబాగార్డెన్స్ ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృత్యువాతపడగా.. మరొకరిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
.ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతి
Last Updated : Sep 2, 2019, 11:27 PM IST
TAGGED:
wall collapse