ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"త్వరలోనే నూతన ఎలక్ట్రికల్ వాహనాల పాలసీ" - ev policy

ఎలక్ట్రిక్ వాహనాల వాడకంలో ఏపీని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి అన్నారు. త్వరలోనే ఓ పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని వెల్లడించారు.

మేకపాటి

By

Published : Sep 18, 2019, 7:36 PM IST

విశాఖలో పారిశ్రామికవేత్తల మొదటి వాణిజ్య సదస్సు

త్వరలో రాష్ట్రంలో నూతన ఎలక్ట్రికల్ వాహనాల పాలసీ తీసుకువస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. విశాఖను వివిధ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని పారిశ్రామికవేత్తల మొదటి వాణిజ్య సదస్సులో చెప్పారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్న మంత్రి.. నాణ్యమైన పరీక్ష కేంద్రాల కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సును మంత్రులు గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. సదస్సులో తొమ్మిది దేశాల నుంచి వచ్చిన 30మందికి పైగా ప్రతినిధులు, 100 మందికి పైగా ఎగుమతిదారులు పాల్గొన్నారు. ఉద్యాన, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ఖనిజాలు, ఫార్మా, ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెస్, వస్త్ర రంగాల్లో ఎగుమతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details