ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 8, 2021, 11:10 AM IST

Updated : Oct 8, 2021, 12:28 PM IST

ETV Bharat / city

Minister Suresh: మంత్రి ఆదిమూలపు సురేష్​ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Minister Suresh and his wife were spotted in the Supreme Court
మంత్రి ఆదిమూలపు సురేష్​ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

11:07 October 08

సుప్రీంకోర్టులో చుక్కెదురు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌(minister suresh) దంపతులకు సుప్రీంకోర్టు(supreme court)లో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో.. సీబీఐ(CBI) విచారణ కొనసాగించాలని ఆదేశించింది. జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఈ మేరకు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక విచారణ చేపట్టాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐకి అనుమతిచ్చింది. 

సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చింది.

ఇదీ చదవండి: 

కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలపై అమరావతి రైతుల ఆందోళన

Last Updated : Oct 8, 2021, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details