ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మీటర్ల ఏర్పాటుతో ఏ ఒక్క రైతుకూ నష్టం వాటిల్లదు: పేర్ని నాని

By

Published : Sep 6, 2020, 7:34 PM IST

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ ఎంత వాడుతున్నారో తెలుస్తుందని మంత్రి పేర్ని నాని అన్నారు. వ్యవసాయానికి ఎంత లోడ్ పడుతుందో, సరఫరా ఎంత కావాలో తెలుస్తుందని పేర్కొన్నారు.

miniser perni nani on free electricity
miniser perni nani on free electricity

మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చేందుకు వీలుంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇప్పటివరకు లక్ష అనధికార వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. అనధికార వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. మీటర్ల ఏర్పాటుతో ఏ ఒక్క రైతుకూ నష్టం వాటిల్లదని.. పేర్ని నాని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details