ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఖరీఫ్​ సాగుకు బ్యారేజీ నుంచి నీరు విడుదల

By

Published : Jun 24, 2020, 12:11 PM IST

ఏలూరు కాలువ, రైవస్​ కాలవలకు ప్రకాశం బ్యారేజీ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఇన్​ఛార్జీ​ మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు పాల్గొన్నారు. ఈ నెలాఖరుకు కేఈబీ కెనాల్​కు, బందరు కాలువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలియజేశారు.

krishna water released from barrage to canals in vijayawada
పూజలో పాల్గొన్న జిల్లా మంత్రుల, ఎమ్మల్యేలు

ఖరీఫ్​ సీజన్​లో పంటల సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్​, ఇన్​ఛార్జీ​ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే, అధికారులు పూజలు నిర్వహించారు. అనంతరం నీటిని విడుదల చేశారు. ఏలూరు కాలువకు, రైవస్​ కాలవలకు మాత్రమే ప్రస్తుతానికి నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారుల తెలియజేశారు. బందరు కాలువ, కేఈబీ కెనాల్​కు మరమ్మతులు జరుగుతున్నందున... వీటికి ఈ నెలాఖరకు నీరు అందిస్తామని తెలిపారు. వర్షాలు పడటం వల్ల ప్రకాశం బ్యారేజీకు భారీగా నీరు వస్తుండటంతో పాటుగా 13 మోటార్లు పనిచేస్తుండటం వల్ల గోదారి నీరు బ్యారేజీకి చేరుతోందని అధికారులు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details